logo

బొత్స ఝాన్సీ,కేకే ఆర్ కి మద్దతు గా ప్రచారంలో పాల్గొన్న పేడాడ రమణికుమారి

విశాఖ ఎంపీ అభ్యర్థి డా. బొత్స ఝాన్సీ లక్ష్మిగారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కె.కె రాజు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు*

ఈ రోజు విశాఖపట్నం లో 50 వ వార్దు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వైసిపి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కె.కె రాజు గారు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం 50వార్డు పరిధిలో వర్మ కాంప్లెక్స్ మురళి నగర్,వంశీ నగర్,తేనేటి నగర్,మాధవధార,ప్రాంతం లో ఇంటింటా ప్రచారం చేసారు.ఈమేరకు ప్రజలుతో కొంతసేపు ముచ్చటించారు.రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అద్యక్షులు కోలా గురువులు గారు,VMRDA చైర్మన్ శ్రీ సనపల చంద్రమౌళి గారు,VKPCPIR చైర్మన్,విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు గారు,రాష్ట్ర,పార్లమెంట్,సిటీ నాయకులు,సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,పార్టీ మండల అద్యక్షులు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,రాష్ట్ర మరియు బిసి కార్పొరేషన్ చైర్మన్&డైరెక్టర్లు,అనుబంధ సంఘాల అధ్యక్షులు& సభ్యులు,JCS మండల కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు,గృహ సారథులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

9
1139 views